Monday, February 20, 2012

rachcha-audio-launch-on-march-4


మార్చి 4.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగ

వచ్చే నెల(మార్చి) 4 వ తేదీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండుగ రోజు కానుంది. ఆ రోజునే రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియోని విడుదల చేయటానకి తేదీ ఖరారు చేసారు. ఆ రోజు నుంచే పబ్లిసిటీ క్యాంపైన్ ప్రారంభం కానుంది.

ఈ విషయమై నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ..కర్నాల్ టౌన్ లో మార్చి నాలుగున ఆడియోని విడుదల చేస్తామని అన్నారు. వేల కొలది అభిమానులు ఆ రోజు నాటికి అక్కడికి చేరుకుంటారని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. గ్రాండ్ గా ఆ ఫంక్షన్ ని చేయటానికి ఎరేంజ్మెంట్స్ గ్రాండ్ స్కేల్ లో చేస్తున్నారు. ఆ రోజు ఇండస్ట్రీలోని టాప్ డైరక్టర్స్ రాజమౌళి, పూరీ జగన్నాధ్, వివి వినాయిక్ హాజరుకానున్నారు. మరి కొంత మంది రామ్ చరణ్ స్నేహ వర్గంలోని హీరోలు కూడా ఈ పంక్షన్ కి హాజరవుతారు. తమిళ టాప్ డైరక్టర్ శంకర్ ని కూడా ఈ పంక్షన్ కి ఆహ్వానించినట్లు సమాచారం.

ఇక హీరోయిన్ తమన్నా, దర్శకుడు సంపత్ నంది, మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ అక్కడ ఎలాగో ఉండనే ఉంటారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment